EB NEWS/పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామం సమీపంలో సోమవారం స్కూటీ అదుపు తప్పడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మణుగూరు మండలం శేషగిరి నగర్కు చెందిన పెంబుల రుతిక్కు తీవ్రగాయలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అఖిల్, బన్నీ కి గాయాలు కావడం తో స్థానికులు ఆసుపత్రి కి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

