EB NEWS/తెలంగాణ
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో హృదయాన్ని కలిచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ పరీక్ష రాసిన ఓ విద్యార్థిని, ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిన చోట తన వేదనను వ్యక్తం చేస్తూ “సార్, కాళ్లు మొక్కుతా… దయచేసి పాస్ చేయండి” అని రాసిన విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పరీక్షా పత్రంలో ఆమె తన వ్యక్తిగత పరిస్థితులను వివరించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు లేరని, చదివింది మర్చిపోయానని, “మీరు దేవుళ్లే” అంటూ గురువులను వేడుకున్నట్లు సమాచారం. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే దానిపై స్పష్టత లేకపోయినా, ఆమె రాసిన మాటలు నెటిజన్లను తీవ్రంగా కలచివేస్తున్నాయి.
ఈ సంఘటనపై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు విద్యార్థిని పరిస్థితిపై సానుభూతి వ్యక్తం చేస్తుంటే, మరికొందరు విద్యా వ్యవస్థలో ఉన్న ఒత్తిడి, పరీక్షల భారం గురించి చర్చిస్తున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా ఉండేందుకు విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్, మానసిక మద్దతు కల్పించడం అత్యవసరమని భావిస్తున్నారు.

إرسال تعليق