EB NEWS/పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించి, వేదమంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రామాల వారీగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీరాముడి కల్యాణాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కొన్నిచోట్ల హరిదాసుల కీర్తనలు, భజన కార్యక్రమాలు నిర్వహించి భక్తి వాతావరణం నెలకొల్పారు.
ఇంకా కొన్ని గ్రామాల్లో భక్తులకు మహా అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. వందలాది మంది పాల్గొని ప్రసాదం స్వీకరించారు. మండల వ్యాప్తంగా శాంతి భద్రతల నడుమ వేడుకలు విజయవంతంగా పూర్తయ్యాయి.

إرسال تعليق