పినపాక ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, సీతంపేట గ్రామానికి చెందిన గుండారపు ప్రశాంత్ కూతురు చందన (03) బ్రెయిన్లో నీరు చేరడంతో ప్రాణాలతో పోరాడుతోంది. పరిస్థితి విషమించడంతో భద్రాచలం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రశాంత్ నిరుపేద కుటుంబానికి చెందిన కూలీ. పని చేస్తేనే పూట గడిచే స్థితిలో ఉన్న ఈ కుటుంబం, కూతురి ప్రాణాల కోసం వారిని వీరిని వేడుకుని అప్పుగా తీసుకొని వచ్చిన డబ్బుతో ఆస్పత్రిలో చేర్పించారు. ఇక చికిత్స కొనసాగించేందుకు వారి వద్ద ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో. తల్లిదండ్రులు కన్నీళ్లతో దాతల సహాయం కోసం చేతులు జోడించి వేడుకుంటున్నారు.
మీరు అందించే చిన్న సహాయమే ఈ చిన్నారికి జీవనదీపం అవుతుంది. దయచేసి స్పందించి చందనకు పునర్జన్మ కలిగించండి.
సహాయం అందించవలసిన phonepe:
9492085751

إرسال تعليق