రాష్ట్రవ్యాప్తంగా వన్యప్రాణి సర్వే పూర్తి.. 994 ఆధారాలు నమోదు

 


TG, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో ములుగు జిల్లా మినహా రాష్ట్రంలోని 32 జిల్లాల్లో అటవీ శాఖ అధికారులు వన్యప్రాణి సర్వేను విజయవంతంగా పూర్తి చేశారు. సర్వేలో భాగంగా కార్నివోర్ సైన్ సర్వే, ట్రాన్సెక్ట్ సర్వే నిర్వహించి అటవీ వృక్షజాలం, జంతు సాంద్రతపై అంచనాలు వేశారు. ప్రాథమిక గణాంకాల ప్రకారం పులులు, ఇతర మాంసాహార జంతువులకు సంబంధించిన 994 ఆధారాలు, 552 పెద్ద శాకాహార జంతువుల ఆనవాళ్లు లభించాయి. వేలాది మంది సిబ్బంది, వాలంటీర్ల సహకారంతో ఈ సర్వే పూర్తయిందని, ఇది వన్యప్రాణి సంరక్షణకు కీలకమని అధికారులు తెలిపారు.

Post a Comment

أحدث أقدم