ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తెలంగాణ - కర్ణాటక అంతరాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు సంగారెడ్డి జిల్లా మడ్గి గ్రామ శివారు ఎక్సైజ్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న 46 కిలోల నైట్రోజెఫమ్ మత్తు పదార్థాలను గోవా నుండి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సులో స్వాధీనం చేసుకున్నారు. గుల్బర్గాలో ఓ వ్యక్తి బస్సులో వేశాడని వాటిని హైదరాబాద్లో తీసుకుంటారని డ్రైవర్ పోలీసులకు తెలిపారు. వీటి విలువ రూ. 73,12,50 ఉంటుందని అంచనా. డ్రైవర్ను అరెస్టు చేసి బస్సును స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి....
కొత్తపల్లి శివారులో కారు బోల్తా: ఒకరికి గాయాలు
Oct 04, 2025,
కొత్తపల్లి శివారులో కారు బోల్తా: ఒకరికి గాయాలు
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు చెట్టును ఢీకొని నుజ్జునుజ్జయింది. హైదరాబాద్ నుంచి లక్షెట్టిపేటకు వెళ్తున్న కారు అతివేగం కారణంగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలవడంతో స్థానికులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
#Karimnagar
#IbrahimpatnaM
ప్రేమ పెళ్లి చేసుకున్న ఆరు రోజులకే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో విషాదం నింపింది.
పోలీసుల కథనం ప్రకారం గ్రామ శివారులోని ఒడ్డెర కాలనీకి చెందిన అల్లెపు గంగోత్రి(22), అదే కాలనీకి చెందిన సంతోష్ ప్రేమించుకున్నారు.
పెద్దల సమక్షంలో సెప్టెంబరు 26న పెళ్లి చేసుకున్నారు.
దసరా పండగ సందర్భంగా ఈ నెల 2న గంగోత్రి భర్తతో కలిసి పుట్టినింటికి వచ్చింది. ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్న సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
అనంతరం సంతోష్ భార్యతో కలిసి తన ఇంటికి వెళ్లారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గంగోత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కాగా భర్తతో జరిగిన గొడవతో మనస్తాపానికి గురవడం, అత్తింట్లో ఏదైనా జరగడం వల్ల తన కూతురు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని మృతురాలి తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు....



إرسال تعليق