EB NEWS/ మణుగూరు:
మణుగూరు సీఎస్పీ సమీప ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 2:00 గంటల సమయంలో రోడ్డుపై గొర్రెలను తీసుకెళ్తుండగా, అతివేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ గొర్రెల గుంపుపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. కొన్ని గొర్రెలకు కాళ్లు విరిగిపోవడంతో పాటు, పొట్టలు పగిలిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. ఆ దృశ్యాలను చూసిన ప్రయాణికులు చలించిపోయారు.
ఈ ఘటనతో గొర్రెల యజమానికి లక్షల్లో నష్టం వాటిల్లింది. తనకు న్యాయం చేయాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


