గ్రామపంచాయతీ కార్మికుడు పిచ్చయ్య కుటుంబానికి న్యాయం చేయాలి
కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
మండలంలోని కరకగూడెం పంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్ గా పనిచేస్తున్న ఇల్లందుల పిచ్చయ్య అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుటుంబానికి ప్రభుత్వం తగిన విధంగా న్యాయం చేయాలని సిఐటియు నాయకులు కొమరం కాంతారావు అధికారులను కోరారు పంచాయతీ కార్మికులు ప్రజల ఆరోగ్యాల కోసం పరిశుభ్రత పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి సేవలందిస్తున్నారని వారి సేవలకు వెలకట్టలేనివని ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అందించేలా చొరవ చూపాలని కుటుంబంలో ఒకరికి మల్టీ పర్పస్ వర్కర్ గా ఉద్యోగం కల్పించాలని కోరుతూ వినతి పత్రం మండల పంచాయితీ అధికారికి అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మిక సంఘం నాయకులు సంజీవరావు, ఉప్పల్ సాంబశివరావు, గుమ్మడవెల్లి కృష్ణ, కంగాల సురేష్, శంకర్, వీరస్వామి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
إرسال تعليق