EB NEWS/తెలంగాణ:
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు మరో 48 గంటల్లో సమ్మె సైరన్ మోగించే అవకాశముందని RTC కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పటికే డిపోల స్థాయిలో సమ్మెకు సన్నాహాలు పూర్తయ్యాయని RTC జేఏసీ నేతలు తెలిపారు. ఇదిలా ఉంటే, సమ్మె అంశాన్ని ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు RTC జేఏసీని అధికారిక చర్చలకు ఆహ్వానించకపోవడం కార్మికుల్లో అసంతృప్తిని పెంచుతోంది.

