🔥 ఎండల హెచ్చరిక – మొబైల్ ఛార్జింగ్‌పై జాగ్రత్తలు తప్పనిసరి!

G Rajashekar
By -
0



EB NEWS/తెలంగాణ:

దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండగా, జూన్ నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


ముఖ్యంగా మొబైల్ ఫోన్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టడం ప్రమాదకరం. అధిక ఉష్ణోగ్రత కారణంగా బ్యాటరీ వేడెక్కి పేలే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు:


* మధ్యాహ్న వేళల్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టకుండా ఉండాలి

* ఫోన్‌ను ఎండలో లేదా కారులో ఉంచకూడదు

* నాణ్యమైన ఛార్జర్ మాత్రమే ఉపయోగించాలి

* ఫోన్ ఎక్కువగా వేడెక్కితే వెంటనే వినియోగం ఆపాలి


ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)