హైదరాబాద్/EB NEWS:
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం రాత్రి దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. తన అల్లుడి వైద్యం నిమిత్తం ఇటీవల ఆయన దుబాయ్కు వెళ్లారు. అయితే ఇరాన్ యుద్ధ ప్రభావంతో విమాన సర్వీసులు రద్దు కావడంతో అక్కడే కొంతకాలం చిక్కుకుపోయారు.
తాజాగా విమానాల రాకపోకలు పునరుద్ధరించడంతో మంత్రి తుమ్మల హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆయన అల్లుడు దుబాయ్లోని ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మంత్రి తిరిగి రావడంతో ఆయన అనుచరులు, పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

إرسال تعليق