EB NEWS/తెలంగాణ:
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన పరిణామం చోటుచేసుకుంది. **తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత**ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.
నార్సింగిలో **మూసీ నది** పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మించబడిన భవనాలపై స్థానికులతో కలిసి కవిత ఆందోళన చేపట్టారు.
“హైడ్రా జేసీబీలు వచ్చి ఈ అక్రమ నిర్మాణాలను కూల్చే వరకు వెనక్కి తగ్గేది లేదు” అంటూ ఆమె బైఠాయించారు.
ఆందోళన ఉద్రిక్తంగా మారుతుందనే ఆందోళనతో నార్సింగి పోలీసులు జోక్యం చేసుకుని కవితను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ అరెస్ట్పై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటుందా?
లేక ఇది రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
👉 ఈ సంఘటనపై మరిన్ని వివరాలు త్వరలో…

రాజకీయ ఉనికి కోసంమే...లేకపోతే ఈ పది సంవత్సరాలు అధికారం లో ఉండి ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు తీస్తారా...
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి