ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ — మావోయిస్టు కమాండర్ ఉధమ్ సింగ్ మృతి

 


ఛత్తీస్‌గఢ్, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పెద్ద గలూరు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కమాండర్ ఉధమ్ సింగ్ మృతిచెందినట్లు అధికారులు ధృవీకరించారు.

సంఘటన స్థలం నుంచి ఆటోమేటిక్ AK-47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు, ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. ఎదురుకాల్పులు పూర్తిగా ముగియకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా భద్రతా దళాలు కఠిన చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

Post a Comment

కొత్తది పాతది