అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మణుగూరుకు చెందిన తోకల శంకర్ (చింటూ) తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను భద్రాచలంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలన్న వైద్యుల సూచనల మధ్యే మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

కామెంట్ను పోస్ట్ చేయండి