ములుగు జిల్లా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మేడారం మహాజాతర సందర్భంగా సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భక్తులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారని ఆరోపణలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొంతమందిని బలవంతంగా తరలించి దాడి చేశారని భక్తులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా, ఆగ్రహంతో కొందరు భక్తులు పోలీసులపై చెప్పులు విసిరారు. పోలీసుల వ్యవహార శైలిపై సమ్మక్క ఆలయం వద్ద భక్తులు నిరసనకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.

కామెంట్ను పోస్ట్ చేయండి