భద్రాచలం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్,
భద్రాచలం సబ్ రిజిస్టర్ షేక్ ఖదీర్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గతంలో బూర్గంపాడు సబ్ రిజిస్టర్గా పనిచేసిన సమయంలో ఆయనపై పలు ఆరోపణలు రావడంతో అప్పట్లో ఏసీబీ దాడులు నిర్వహించారు. అనంతరం సేకరించిన ఆధారాలతో లోతైన విచారణ చేపట్టిన అధికారులు తాజాగా ఆయనను అరెస్టు చేశారు. ఈ ఘటనతో రిజిస్ట్రేషన్ శాఖలో కలకలం రేగింది.

إرسال تعليق