*పోలీసులకు చిక్కిన రాయపర్తి ఎస్బిఐ బ్యాంకు దోపిడీ దొంగల ముఠా సభ్యులు*
గత నెల 18వ తేదీ అర్ధరాత్రి రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకులో దుప్పటికి పాల్పడిన ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యులు ముఠాలోని ముగ్గురు దొంగలను వరంగల్ పోలీసులు అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు సహా మరో నలుగురు నిందితులు పరార్ లో ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీసులకు పట్టుబడిన నిందితుల నుండి సుమారు కోటి 80 లక్షల 4000 రూపాయల విలువ గల రెండు కిలోల 520 గ్రాముల బంగారు అభరణాలు, ఒక కారు 10000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబకిషోర్ ఝా వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు... ఈ దొంగల ముఠా ముందుగా గూగుల్ యాప్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని బ్యాంకుల సమాచారాన్ని సేకరించి వారికి అనుకూలంగా ఉన్న బ్యాంకులో చోరీ చేసేందుకు ఒక ప్రణాళిక రచించుకొని చోరీ చేస్తారని తెలిపారు.. దానిలో భాగంగానే పోయిన నెల 18వ తేదీ అర్ధరాత్రి రాయపర్తి ఎస్బిఐ బ్యాంకు స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టి స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న మూడు లాకర్లను ఈ మూట తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టలను వినియోగించి లాకర్ను కట్ చేసి అందులో ఉన్న సుమారు 13 కోట్ల 61 లక్షల రూపాయల విలువగల బంగారు ఆభరణాలను వారి వెంట తెచ్చుకున్న సంచుల్లో వేసుకొని బంగారాన్ని మొత్తం ఎత్తుకెళ్లారని తెలిపారు . అనంతరం నిందితులు వచ్చిన కారులో తిరిగి హైదరాబాద్ కు చేరుకొని చోరీ చేసిన సొత్తును ఏడు సమాన వాటాలుగా పంచుకున్నారు... నవంబర్ 19వ తేదీన నిందితులు మూడు బృందాలుగా విడిపోయి మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ కి వెళ్లిపోయారు అన్నారు. ఈ భారీ చోరీపై అప్రమత్తమైన వరంగల్ కమిషనర్ పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు. వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ నేతృత్వంలో పదికి పైగా బృందాలు ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న టెక్నాలజీ వినియోగించుకొని నిందితులను పట్టుకోవడం కోసం గాలింపు చర్యని వేగవంతం చేసి ముగ్గురు నిందితుని గుర్తించి అరెస్టు చేశామన్నారు
కామెంట్ను పోస్ట్ చేయండి