భద్రాద్రి: EB న్యూస్:
మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు, అధికారులు కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా పని చేస్తున్నారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని ఇతర ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం తనకు ఇవ్వడం లేదని, రేవంత్ రెడ్డితో స్నేహం కారణంగానే అవమానాలు భరిస్తున్నానని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలను లోపలికి అనుమతించి తమ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? జైల్లో పెడతారా? తనకు అది కొత్త కాదని, “నేను పిల్లిని కాదు, టైగర్ను” అంటూ ఘాటుగా స్పందించారు.

إرسال تعليق