భద్రాద్రి, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ -XI విడుతలో జిల్లా వ్యాప్తంగా 54 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు ఒక ప్రకటనను విడుదల చేశారు.ఆపరేషన్ ముస్కాన్ XI విజయవంతం కోసం జిల్లాలో 05 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.ఇందులో భాగంగా జూలై 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్ -XI కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది.ఇందులో 54 మంది బాలకార్మికులను గుర్తించడమైనదని తెలిపారు.ఇందులో 44 మంది మగ పిల్లలు,10 మంది బాలికలు ఉన్నారని తెలిపారు.ఈ 53 మందిని వారి తల్లిదండ్రులకు, ఒకరిని హోమ్ కి అప్పగించడం జరిగిందని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న 39 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని,13 మందికి నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని,బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు.అలాగే ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100/112 కి ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం అందించాలని తెలిపారు.ఆపరేషన్ ముస్కాన్ -XI లో భాగంగా బాలకార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగించిన ప్రత్యేక బృందాల సభ్యులను ఈ సందర్బంగా ఎస్పీ గారు అభినందించారు.
إرسال تعليق