EB NEWS/తెలంగాణ:
గణపతి నవరాత్రుల సందర్భంగా లడ్డు, కలశం ప్రసాదాల విషయంలో ఈసారి కొన్ని చోట్ల కొత్త విధానం కనిపిస్తోంది. సాధారణంగా ప్రసాదాల కోసం వేలంపాట నిర్వహించడం ఆనవాయితీగా ఉండగా.. కొన్ని గణపతి మండపాల్లో లక్కీ డ్రా విధానాన్ని అమలు చేస్తున్నారు. తక్కువ మొత్తంతో టికెట్ తీసుకునే అవకాశం కల్పించి.. డ్రా ద్వారా లడ్డు, కలశం ప్రసాదాలను డ్రాలో గెలుపొందిన భక్తులకు అందిస్తారు. దీంతో గణపతి ఉత్సవాల్లో ప్రసాదాల పంపిణీకి సంబంధించిన ఈ విధానం ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.
అయితే లక్కీ డ్రా నిర్వహణలో పారదర్శకత, స్పష్టమైన నిబంధనలు పాటించడం ముఖ్యమని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
గణపతి ఉత్సవాల్లో కనిపిస్తున్న ఈ కొత్త విధానంపై మీ అభిప్రాయం ఏమిటి..?

