మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మణుగూరు మండలం సురక్ష బస్టాండ్ ప్రాంతంలో రహదారి మొత్తం జలమయం అయింది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు ఈ సందర్భంగా కోరుతున్నారు.
మరి కొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది .
ఇది కూడా చదవండి...
ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరు కావాలి: పీవో
భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో రేపు నిర్వహించే గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివారం ప్రకటించారు.
ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, గిరిజనులు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులను అందజేయాలని పీవో వెల్లడించారు.
కామెంట్ను పోస్ట్ చేయండి