ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కులగణన సర్వే ఓ దొంగ సర్వే అని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న ఆరోపించారు. BCలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. HYDలోని తన ఆఫీసులో సర్వే పేపర్లను తగలబెట్టారు. 'కులగణన సర్వేను జానారెడ్డి చేయించారు. ఈ సర్వేను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోం. ఈ విషయాన్ని BCలు సహించరు. సర్వేలో దాదాపు 40 లక్షల మంది బీసీలను తగ్గించడం అన్యాయం' అని మల్లన్న ఫైర్ అయ్యారు.
తీన్మార్ మల్లన్నపై టీపీసీసీ సీరియస్.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.
కామెంట్ను పోస్ట్ చేయండి