భద్రాద్రి ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ :
ప్రజాభిప్రాయం మేరకు, ప్రజల సమ్మతితో గ్రామసభలు..
గ్రామ సభలలో సంక్షేమ పథకాలు అర్హుల పూర్తి జాబితా ప్రదర్శించాలి..జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
చిట్టచివరి అర్హుల వరకు సంక్షేమ పథకాలు అందాలి, ఇది నిరంతర ప్రక్రియ...
గ్రామ సభలలో సంక్షేమ పథకాల దరఖాస్తులు స్వీకరించడానికి ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చెయ్యాలి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26 నుంచి అందించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకాల అమలులో భాగంగా రేపటినుండి నుండి 24 వరకు నిర్వహించు గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి జిల్లాలోని ఆర్డీవోలు,తాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు,ఎంపీఓలు, పంచాయతీ సెక్రటరీలు మరియు సంబంధిత అధికారులతో గ్రామ సభల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి, గ్రామసభల నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, చేపట్టవలసిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేపటినుండి నిర్వహించు గ్రామ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామసభల నిర్వహణ ఈ వార్డులో ఏ రోజు గ్రామ సభలో నిర్వహించేది ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. గ్రామసభల నిర్వహణకు టెంట్లు, మైక్ సెట్ లు, త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాభిప్రాయం మేరకు ప్రజల సమ్మతితో గ్రామసభలు నిర్వహించాలన్నారు. గ్రామసభలు నిర్వహించు గ్రామపంచాయతీ సెక్రటరీలకు తగిన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సభలలో సంక్షేమ పథకాల పట్ల ప్రజల సందేహాలను అధికారులు నివృత్తి చేయాలన్నారు. గ్రామ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనేలా చర్యలు చేపట్టాలని, సంక్షేమ పథకాలు గురించి అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. సంక్షేమ పథకాల అర్హుల పూర్తి జాబితాను గ్రామ సభలలో ప్రదర్శించాలని అన్నారు.
చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రేషన్ కార్డ్ దరఖాస్తులు మరియు ఇంటింటి కుటుంబ సర్వే ఆధారంగా రేషన్ కార్డు లేని వారికి ప్రభుత్వమే కొత్త రేషన్ కార్డు మంజూరు చేయుటకు గాను విడుదల చేసిన అర్హుల జాబితాను గ్రామ సభలలో ప్రదర్శించాలన్నారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డు అందుతుందని, జాబితాలో పేరు రాని అర్హుల వద్దనుండి దరఖాస్తులను తీసుకునేందుకు వీలుగా గ్రామసభలలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ సేవ కేంద్రాలలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న జాబితా మరియు మార్పులు చేర్పులు కోసం దరఖాస్తు చేసుకున్న జాబితాను కూడా గ్రామ సభలలో ప్రదర్శించాలన్నారు. చిట్ట చివరి అర్హుల వరకు సంక్షేమ పథకాలు అందేలా తగిన చర్యలు చేపట్టాలని, సంక్షేమ పథకాల అమలు అనేది నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ తెలిపారు.
గ్రామ సభలలో నాలుగు సంక్షేమ పథకాలకు వచ్చినటువంటి దరఖాస్తుల వివరాలను, మరియు గ్రామసభ తీర్మానాలను నిర్దేశిత పట్టిక ద్వారా నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా పౌరసరఫరాల అధికారి రుక్మిణి, పిడి హౌసింగ్ శంకర్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, ఏవో రమాదేవి మరియు వ్యవసాయ శాఖ ఏ డి లు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కామెంట్ను పోస్ట్ చేయండి