తీవ్ర విషాదం .. బలగం ఫేమ్ మొగిలయ్య కన్నుమూత

 తీవ్ర విషాదం.. ‘బలగం’ ఫేమ్ మొగిలయ్య కన్నుమూత

బలగం ఫేమ్ మొగిలయ్య గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు.

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్; 

వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగిలయ్య సంవత్సరం కాలంగా కిడ్నీ ఫెయిల్యూర్తో డైయాలసిస్ చేయించుకుంటూ అనారోగ్యల కారణంగా మంచానికే పరిమితమై ఉన్నారు. మొగిలయ్య దంపతులు కామెడీయన్, డైరెక్టర్ వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్పై నిర్మించిన బలగం సినిమా తెలంగాణలో ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. మూవీ క్లైమాక్స్ మానవ సంబంధాలను వివరిస్తూ ఆయన చేసిన గానం 'తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి' అనే పాట ప్రజల గుండెలను హత్తుకుని కంటతడి పెట్టించింది. ఆ సన్నివేశమే సినిమాకు. హైలెట్గా నిలిచించింది.

దీంతో కొండమ్మ, మొగిలయ్య రంపతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచుర్యంలోకి వచ్చారు. మొగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం బలగం సినిమా డైరక్టర్ వేణు యెల్దండి, చిత్ర యూనిట్ ఆర్థిక సాయం అందించింది. గత ప్రభుత్వం మొగిలయ్యకు దళితబంధు పథకం ద్వారా రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ మొగిలయ్య దంపతులకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని, వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని పొన్నం నర్తయ్య ఆవార్డు ఫంక్షన్లో ప్రకటించారు. స్పీకర్ గద్దం ప్రసాద్ మొగిలయ్య ఆరోగ్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. ఆయన మృతి పట్ల బలగం సినిమా డైరక్టర్ వేణు యెల్దండి, తోటి నటినటులు, గ్రామస్తులు సంతాపం ప్రకటించారు.

Post a Comment

కొత్తది పాతది