మరోసారి మానవత్వం చాటుకున్న ఎస్ఐ రాజ్ కుమార్



EB NEWS/కరకగూడెం:


​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం:ఆపదలో ఉన్నామంటే చాలు "నేనున్నానంటూ" ముందుకొచ్చే పాకాల కొత్తగూడ ఎస్సై రాజ్‌కుమార్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. విధి నిర్వహణలోనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తాజాగా ఒక నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు.


​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, శ్రీరంగాపురం గ్రామానికి చెందిన గోగు రజిత ఆమె చిన్నారి ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ఎస్సై రాజ్‌కుమార్ దృష్టికి వెళ్ళింది. వెంటనే ​స్పందించిన ఎస్సై.


​గతంలో కరకగూడెం పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన సమయంలోనే రాజ్‌కుమార్ స్థానిక ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ 'మంచి మనసున్న మారాజు'గా పేరు తెచ్చుకున్నారు. బాధితుల పరిస్థితిని తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి, తన వంతు సహాయంగా 3,000 రూపాయలను ఆ కుటుంబానికి అందజేశారు.


ప్రజల ప్రశంసలు:


​ఖుషీలో ఉన్నప్పుడు కాకుండా, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే గుణమే అసలైన మానవత్వమని రాజ్‌కుమార్ మరోసారి నిరూపించారు.​ఆయన చేసిన ఈ చిన్న సహాయం ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది.

​పోలీస్ అంటే కేవలం శాంతిభద్రతలే కాకుండా, సామాజిక బాధ్యత కూడా అని చాటిచెప్పిన ఎస్సైపై స్థానిక ప్రజలు మరియు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

Post a Comment

కొత్తది పాతది