ఆధార్ సేవల సవరించిన ఛార్జీల వివరాలు ప్రతి కేంద్రంలో స్పష్టంగా ప్రదర్శించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.




భద్రాద్రి ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ సేవలపై సవరించిన కొత్త రుసుములు 2025 అక్టోబర్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని అన్నారు. ప్రజలకు ఈ మార్పులపై పూర్తి అవగాహన కల్పించే విధంగా అన్ని ఆధార్ సేవా కేంద్రాల్లో కొత్త రుసుముల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలనీ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటన తెలిపారు.


ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ బయోమెట్రిక్ అప్‌డేట్ (ఫింగర్ప్రింట్, ఐరిస్, ఫోటో) కోసం రేట్లు ఇలా ఉన్నాయి: 5-7 ఏళ్ళ పిల్లలకు ఒకసారి అప్‌డేట్ చేయడం ఫ్రీ, 15-17 ఏళ్ళ పిల్లల కోసం ఒకసారి ఫ్రీ. మిగతా సందర్భాల్లో Rs 125 వసూలు అవుతుంది.డెమోగ్రాఫిక్ అప్‌డేట్ అంటే పేరు, లింగం, జన్మతేదీ, చిరునామా, మొబైల్, ఇమెయిల్ వంటి వివరాలను మార్చడం. బయోమెట్రిక్ అప్‌డేట్ తో పాటు చేస్తే ఫ్రీ, వేరుగా చేస్తే Rs 75 వసూలు. డాక్యుమెంట్ అప్‌డేట్ అంటే ID, చిరునామా డాక్యుమెంట్స్ సమర్పించడం. myAadhaar పోర్టల్ ద్వారా చేస్తే ఫ్రీ, ఎన్‌రోల్మెంట్ సెంటర్ ద్వారా చేస్తే Rs 75 వసూలు.హోమ్ ఎన్‌రోల్మెంట్ సర్వీస్ కోసం ఫీజు Rs 700. ఒకే చిరునామాకు బహుళ మంది తీసుకుంటే మొదటి వ్యక్తికి Rs 700, మిగతా వ్యక్తులకి Rs 350 చార్జ్. ఆధార్ డౌన్‌లోడ్ చేసి ముద్రించుకోవడానికి రూ.40 చెల్లించవలసి ఉంటుంది అని అన్నారు.


జిల్లా ప్రజలు ఆధార్ సంబంధిత సేవల కోసం కేవలం అధికారిక ఆధార్ సేవా కేంద్రాలు లేదా గుర్తింపు పొందిన సెంటర్లను మాత్రమే వినియోగించాలనీ, ప్రజల్లో ఏ విధమైన అపోహలు లేకుండా సవరించిన రుసుములపై విస్తృత ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Post a Comment

కొత్తది పాతది