కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటుకు కృషి చేస్తా..: ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 హైదరాబాద్ తర్వాత.. రెండో అతిపెద్ద పారిశ్రామిక కేంద్రమైన కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటు కోసం కేంద్రస్థాయిలో కృషి చేస్తున్నట్లు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాంరెడ్డి అన్నారు. గతంలో కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని పలుమార్లు కలిశామని, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా.. నుంచి కేంద్ర ప్రత్యేక బృందం కూడా వచ్చి సర్వే చేసిందని గుర్తు చేశారు. ఇక్కడి కలెక్టర్.. కేంద్రానికి ఓ రిపోర్ట్ కూడా ఇవ్వబోతున్నారని అన్నారు. అలాగే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు ఉన్నారని, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అభివృద్ధికి వారు రాష్ట్రంలో మిగతా జిల్లాలన్నింటీ కంటే ఎక్కువ నిధులు ఇక్కడికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని వివరించారు.

Post a Comment

أحدث أقدم