కానిస్టేబుల్ వేధింపులకు వివాహిత ఆత్మహత్య



భద్రాద్రి, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 


భద్రాద్రి కొత్తగూడెం లో ఓ కానిస్టేబుల్ వేధింపుల వల్ల వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పాల్వంచ టౌన్‌లో చోటుచేసుకుంది. 


వికలాంగుల కాలనీకి చెందిన త్రివేణికి భర్తతో మనస్పర్థలు రావడంతో కొన్నేళ్ల నుంచి వేరుగా ఉంటున్నారు. 


వరుసకు మరిది అయ్యే చింతకాని(M) నాగారంకి చెందిన కానిస్టేబుల్ నాగరాజు వేధిస్తూ ఆమెతో ఉన్న చిత్రాలను బంధువులకు షేర్ చేయడంతో మనస్తాపం చెంది ఉరేసుకుందని ఎస్సై సుమన్ తెలిపారు.




ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 


ఈ ఆర్థిక ఏడాది 4.50 లక్షల మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ వ్యయాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిమెంట్, స్టీల్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. 


మార్కెట్ ధరల కంటే తక్కువకు నిర్మాణ సామగ్రిని అందించడం ద్వారా లబ్ధిదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలి కాలంలో సిమెంట్, స్టీల్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఒక్కో సిమెంట్ బస్తాపై బ్రాండ్‌ను బట్టి రూ.50 నుంచి రూ.80 వరకు, టన్ను స్టీల్‌పై రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ధరలు పెరిగాయి. 


ఈ ధరల పెరుగుదల వల్ల ఒక్కో లబ్ధిదారు అదనంగా రూ.17 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా.


 ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తుండగా.. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ నిధులతో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ఇసుకను ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. సిమెంట్, స్టీల్ ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత వారం సిమెంట్, స్టీల్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపింది. 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి మొత్తం 40.50 లక్షల టన్నుల సిమెంట్, 68 లక్షల టన్నుల స్టీల్ అవసరమని ప్రభుత్వ అధికారులు కంపెనీల ప్రతినిధులకు వివరించారు. 


ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిమెంట్ బస్తాను రూ.260కి, టన్ను స్టీల్‌ను రూ.47 వేలకు అందించాలని ప్రభుత్వం కోరింది. 


ధర తగ్గింపుపై కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వానికి తెలిపారు.


ఈ వారంలోనే దీనిపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుని, ధర తగ్గింపుపై ప్రభుత్వం, కంపెనీల ప్రతినిధులు సంయుక్తంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి. 


పరిశ్రమలు ధర తగ్గింపునకు ముందుకు వస్తే, నిర్మాణ సామగ్రిని నేరుగా లబ్ధిదారులకే అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లేదా స్థానిక అధికారుల నుంచి లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందించాలని యోచిస్తోంది.


 ఇది పారదర్శకతను పెంచడంతో పాటు, లబ్ధిదారులకు తక్కువ ధరకే నాణ్యమైన సామగ్రి అందుబాటులో ఉండేలా చేస్తుంది. 


ఈ చర్యల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఖర్చులు తగ్గటంతో పాటు ఇంటి నిర్మాణాలు విజయవంతంగా పూర్తి కావడానికి దోహదపడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.


ఇది కూడా చదవండి...బిగ్ బ్రేకింగ్ న్యూస్: మావోయిస్టుల లొంగుబాటు


దేవత లాంటి డాక్టరమ్మ

Post a Comment

కొత్తది పాతది