ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ చేజిక్కించుకోవడంలో భద్రాచలంకి చెందిన గొంగడి.త్రిషారెడ్డి కీలక పాత్ర..
ఇండియాకు వరల్డ్ కప్ అందించిన గొంగడి త్రిషారెడ్డికి దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ.
అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో19 ఏళ్ల గొంగడి త్రిష సంచలనం సృష్టించారు. 7 మ్యాచుల్లో 309 రన్స్ చేసి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు.
ప్రత్యర్థి బౌలర్ల బౌలింగ్ ను చాకచక్యంగా ఎదుర్కొంటు
ఈ టోర్నీలో
ఒక సెంచరీ కూడా చేసింది.
యావరేజ్ 77, స్ట్రైక్ రేట్ 144గా ఉండటం విశేషం మహిళా క్రికెట్ విభాగంలో మిథాలీ రాజ్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ. భారత క్రికెట్ లో సంచలనాలు సృష్టించారు.
ఆ వరుసలో చేరేందుకు సంసిద్ధమవుతోంది తెలుగుతేజం.
అద్భుతమైన బౌలింగ్ ఔరా అనిపించే బ్యాంటింగ్తోతో ప్రత్యర్థులకు ముచ్చేమటలు పట్టిస్తోంది పల్లెటూరి నుంచి మొదలైన క్రీడాకుసుమం దండయాత్ర
ప్రపంచ వేదికపై పరుగుల వరద పారిస్తోంది మహిళల అండర్ -19 ప్రపంచకప్ చరిత్రలోనే తొలి శతకం నమోదు చేసి సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకుంది.
ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు గొంగడి త్రిషవే బౌలింగ్లోనూ సత్తా చాటి గొంగడి త్రిష 7 వికెట్లు తీశారు. భద్రాచలంకు చెందిన త్రిష ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఓపెనర్గా వచ్చి 4, 27, 49, 40, 110, 44 రన్స్ చేశారు.
కామెంట్ను పోస్ట్ చేయండి