ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భారత ప్రభుత్వం తన అత్యంత ప్రతిష్టాత్మకమైన బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని 22 జనవరి 2015 లో ప్రారంభించింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు ఈ పథకం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పోస్టర్ల ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
బేటీ బచావో బేటీ పఢావో లో ముఖ్యంగా బాలికలు ఎదుర్కొంటున్న , సమాజంలో అంతర్లీనంగా ఉన్న వివక్షను పరిష్కరించడం కోసం సిబ్బంది పనిచేయాలన్నారు.
ఆడపిల్లలను రక్షించడంతోపాటు లింగ-ఆధారిత అసమానతలను తొలగిస్తూ ఆడపిల్లలకు సరైన పెరుగుదల , విద్యావకాశాలు, పుట్టుక కు సంబంధించి మెరుగైన అభివృద్ధికి అందరూ కృషిచేయాలని కోరారు. బాలికల భద్రత రక్షణ వంటి అంశాలపై ఎక్కువగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మునగాకు తరచూ తినడం వలన రక్తహీనతకు దూరమవుతారని మునగ మొక్కలు నాటడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని అన్నారు .
బాల్య వివాహాల నిరోధక చట్టాలు గురించి వివరించి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రేమ పేరుతో బాలికలు మోసపోకూడదని కోరారు.
అవగాహన, ప్రేరణాత్మక మరియు స్ఫూర్తి దాయక విషయాలపై ఇంకా అవగాహన కార్యక్రమాలు నేటి నుండి మార్చ్ 8 వరకు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి స్వర్ణలత లెనీనా, బాలల సంరక్షణ అధికారి హరి కుమారి, మహిళా సాధికారత కోఆర్డినేటర్ సంతోష రూప ,
టి ఎస్ డబ్లు ఆర్ జే సి విద్యార్థినులు , భారతి , మాధవి
మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ జాహేద , సాహితీ , అకౌంటెంట్ ప్రియాంక, స్వాతి, మౌనిక తదితరులు పాల్గోన్నారు.
కామెంట్ను పోస్ట్ చేయండి