టైరు పేలి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు (వీడియో)

G Rajashekar
By -
0

 



రాజన్న జిల్లా జనవరి 31 ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్ :

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివారు లోఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 


రన్నింగ్ లో ఆర్టీసీ బస్సు టైర్ పగిలిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురి ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. 


ప్రమాదం గమనించి స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణి  కులను కష్టం మీద బయ టకు తీసుకువచ్చారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు.


సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)