భద్రాద్రి కొత్తగూడెం ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
బ్యాంకులు సరైన భద్రతను ఏర్పాటు చేసుకోవాలి ఎస్పీ రోహిత్ రాజు
జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులతో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సమావేశమయ్యారు.ముఖ్యంగా ఇటీవల వరంగల్, బీదర్ ప్రాంతాలలో బ్యాంకులలో జరిగిన దొంగతనాలను ఉద్దేశించి,అలాంటి సంఘటనలు జిల్లాలో జరగకుండా బ్యాంకు అధికారులు తమ తమ బ్యాంకులకు సంబంధించి పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.బ్యాంకుల లోపల, వెలుపల అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.బ్యాంకులలో ఉండే సెక్యూరిటీ అలారం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.ATM లలో నగదును లోడ్ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని,అక్కడ సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు.సామాజిక బాధ్యతలో భాగంగా సైబర్ క్రైమ్స్ పై బ్యాంకుల తరఫునుండి కూడా జిల్లా ప్రజలకు నిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు.ఇందులో భాగంగా కరపత్రాలను,పోస్టర్లను తయారుచేసి ముఖ్యమైన ప్రదేశాల్లో అతికించాలని సూచించారు.సైబర్ నేరాల బారిన పడి నగదును కోల్పోయిన బాధితులకు నేరగాళ్ల అకౌంట్లలో ఫ్రీజ్ చేయబడిన నగదును త్వరితగతిన వారికి అందేలా పోలీస్ శాఖతో సమన్వయం పాటిస్తూ చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.ప్రభుత్వ ఇన్సూరెన్స్ స్కీములకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించి వారు జీవిత బీమాలు చేసుకునే విధంగా ప్రచారం చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ సింగ్ ఐపిఎస్,ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జితేందర్ , జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
కామెంట్ను పోస్ట్ చేయండి