సంక్రాంతి’ ప్రయాణికులపై 'ప్రత్యేక' భారం

encounterbulletnews
By -
0

 

‘సంక్రాం


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

తెలంగాణ : సంక్రాంతికి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులపై తెలంగాణ ఆర్టీసీ ‘ప్రత్యేక’ భారం మోపింది. 6432 స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. 10, 11, 12, 19, 20 తేదీల్లో మాత్రమే అదనపు ఛార్జీలు ఉంటాయని పేర్కొంది. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ కొనసాగుతుందని చెప్పింది. అటు ఏపీలోని ప్రత్యేక బస్సుల్లో ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)