అసెంబ్లీ ఉద్యోగుల ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్

 ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:



హైదరాబాద్:డిసెంబర్ 18

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల అయ్యింది. 


ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, ఫలితాల ప్రకటన వంటి వివరణలను అధికారులు వెల్లడించారు. 


*ఎన్నికల షెడ్యూల్*


నామినేషన్ల దాఖలు: 18.12.2024 నుండి 19.12.2024 వరకు సాయంత్రం 4.00 గంటల వరకు.


నామినేషన్ల చెల్లుబాటు జాబితా ప్రచురణ: 19.12.2024 సాయంత్రం 5.00 గంటలకు.


నామినేషన్ల ఉపసంహరణ: 20.12.2024 నుండి 21.12.2024 మధ్యాహ్నం 3.00 గంటల వరకు.


తుది జాబితా ప్రచురణ: 21.12.2024 సాయంత్రం 5.00 గంటలకు.


పోలింగ్ తేదీ: 04.01.2025 (ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల) వరకు.


ఫలితాల ప్రకటన: 04.01.2025 సాయంత్రం 5.00 గంటల నుండి.


సచివాలయ ఉద్యోగుల సంక్షేమానికి, వారి హక్కుల రక్షణకు ఈ ఎన్నికలు కీలకంగా ఉంటాయని ఉద్యోగ సంఘం సభ్యులు భావిస్తున్నారు. 


అన్ని ఏర్పాట్లను సచివాలయ ఎన్నికల కమిటీ నిర్వహించనుంది.

Post a Comment

కొత్తది పాతది