EB NEWS:
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన **‘VBG RAM JI’** స్కీమ్కు ప్రత్యేక లోగో రూపొందించేందుకు దేశవ్యాప్తంగా పోటీ నిర్వహిస్తోంది. సృజనాత్మకత ఉన్న వారికి ఇది మంచి అవకాశం. ఈ పోటీలో ఉత్తమంగా లోగో రూపొందించిన వ్యక్తికి **రూ.50,000 నగదు బహుమతి** అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు **mygov.in** వెబ్సైట్లో తమ **మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీతో లాగిన్ అయి** లోగోను అప్లోడ్ చేయాలి.
కాగా, ఈ కొత్త స్కీమ్లో గ్రామీణ ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు **పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచినట్లు** కేంద్రం వెల్లడించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు మరింత ఉపాధి లభించే అవకాశం ఉంది. 👨🌾
లోగో డిజైన్ పోటీకి దరఖాస్తు చివరి తేదీ: మార్చి 20.
కాబట్టి డిజైన్లో ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

కామెంట్ను పోస్ట్ చేయండి