మణుగూరు: EB న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరులో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మత్తు ప్రభావంలో ఉన్న ఓ వ్యక్తి కాలనీలోని కొంతమంది నివాసితులపై దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం.
ఘటన తర్వాత సంబంధిత వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రివేళల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరుతున్నారు.

కామెంట్ను పోస్ట్ చేయండి