హైదరాబాద్, EB న్యూస్:
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్సై వినయ్ కుమార్ రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కేసులో CRPC 41 కింద నోటీసులు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు మాదాపూర్ పీఎస్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

إرسال تعليق