ఫైనల్స్... ఉత్కంఠ పోరులో రాజస్థాన్ ఘనవిజయం



 పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఉత్తరప్రదేశ్ – రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ 26–26తో టైగా ముగిసిన తర్వాత, విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన సూపర్–5 టై బ్రేకర్ మ్యాచ్ నరాలు పగలగొట్టింది. ఈ టై బ్రేకర్‌లో రాజస్థాన్ జట్టు అద్భుతంగా ఆడి 2 పాయింట్ల తేడాతో గెలిచి టోర్నమెంట్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది.

చివరి క్షణం వరకూ మారుతున్న స్కోరు, ప్రతి రైడ్‌లో పెరిగిన ఉత్కంఠతో ఈ మ్యాచ్ కబడ్డీ అభిమానులకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది.

Post a Comment

కొత్తది పాతది