మణుగూరు ఇకనైనా రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి- వాహనదారులు

G Rajashekar
By -
0

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మణుగూరు నుండి బిటిపిఎస్ బయ్యారం క్రాస్ రోడ్ వరకు ఉన్న రోడ్డు దారుణమైన స్థితిలో ఉన్నందని, దాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.. ఈ రోడ్డు మీదుగా పినపాక, కరకగూడెం, గుండాల, ములుగు , ఏటూరు నాగారం వంటి ప్రాంతాలకు నిత్యం ప్రయాణం చేస్తుంటారు.. అనేకమంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణాలు చేయాలంటే గుండెలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. వర్షాకాలం వల్ల గుంతలు ఎక్కువ నాన్న అవస్థలు పడుతున్నామని వాహనదారులు చెబుతున్నారు. ఇకనైనా రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, వాహన దారులు కోరుతున్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)