మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్:
-వందల కోట్ల రూపాయలు ప్రజలకు ఉపయోగపడటం లేదు
-మాజీ జడ్పిటిసి పాల్వంచ దుర్గ
మణుగూరు మున్సిపాలిటీలో ప్రజలు కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని వినియోగంలోకి తేవాలని మాజీ జెడ్పిటిసి పాల్వంచ దుర్గ జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్ లో అదనపు కలెక్టర్ కె . వెంకటేశ్వర్లు గారికి సోమవారం వినతిపత్రం అందజేశారు. మణుగూరు మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి పాల్వంచ దుర్గ గారు, మణుగూరు మునిసిపాలిటీ పరిధిలో ప్రజాధనంతో నిర్మించిన ఇంటిగ్రేట్ మార్కెట్, స్మశాన వాటిక, యాత్రలు డిజిటల్ లైబ్రరీ భవనాలు కోట్లు విలువైన మౌలిక వసతులు నిర్లక్ష్యంగా ఉండటం, ప్రజల వినియోగానికి అందకుండా ఉండటం, కొన్ని చోట్ల దుర్వినియోగం జరుగుతున్నట్టుగా సమాచారం రావడంతో జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్లకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందించారు.
వివరణాత్మకంగా సూచించిన అంశాలు:
ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్ భవనం: చిన్న వ్యాపారులు, మహిళా సంఘాలు, రైతుల ఉత్పత్తులను ఒకే చోట అమ్మేందుకు నిర్మించిన ఈ భవనం తాళం వేసి ఉంది. ఇప్పటివరకు ఎలాంటి వినియోగానికి రాలేదు.
గిరిజన డిజిటల్ లైబ్రరీ: గిరిజన యువతకు డిజిటల్ పరిజ్ఞానం అందించేందుకు నిర్మించిన లైబ్రరీ కూడా మూసివేయబడి ఉంది. విద్యార్థులు దీని ఉపయోగాన్ని పొందలేక నష్టపోతున్నారు.
శ్మశాన వాటిక: శుభ్రతతో కూడిన అంత్యక్రియల కోసం నిర్మించిన శ్మశాన వాటిక పరిస్థితి బాగా దెబ్బతింది. ప్రజలు అనుసంధానం లేకుండా అసౌకర్యంగా ఇతరత్రా ప్రాంతాల్లో అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి.
మునిసిపల్ వాహనాలు మరియు యంత్రాలు: కూపెరు, ట్రాక్టర్లు, ఫాగింగ్ మెషీన్లు వాడకంలో లేవు లేదా ప్రైవేట్ ఉపయోగానికి వాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. పారిశుద్ధ్య కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.
ప్రధాన ఆందోళనలు:
కోట్ల రూపాయల ప్రజాధన వృథా అవుతోంది
నిర్మించిన భవనాలను ప్రజలు వినియోగించలేకపోతున్నారు
గిరిజన విద్యార్థులు డిజిటల్ వనరుల కొరతతో బాధపడుతున్నారు
ఎటువంటి బాధ్యత తీసుకునే అధికారులు లేరు
పారిశుద్ధ్య సేవలు ప్రభావితమవుతున్నాయి
డిమాండ్లు మరియు సూచనలు:
పై పేర్కొన్న అన్ని భవనాలు మరియు వాహనాలపై అధికారుల ద్వారా తక్షణ తనిఖీ
సూపర్ మార్కెట్, డిజిటల్ లైబ్రరీ, శ్మశాన వాటికలను ప్రజల వినియోగానికి తెరుచుకోవాలి
నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు
మునిసిపల్ వాహనాలపై ఆడిట్ నిర్వహించాలి
ప్రజా పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలి
తిరిగి ప్రారంభించేందుకు గడువులు ప్రకటించాలి
ఈ సందర్భంగా పాల్వంచ దుర్గ గారు పేర్కొనగా:
“ఇది ప్రజల హక్కుల సమస్య. మౌలిక వసతుల అభివృద్ధి కోసం వెచ్చించిన ధనం వృథా కాకూడదు. మౌలిక వనరులను తిరిగి ప్రజల వినియోగానికి అందించడమే ప్రభుత్వ బాధ్యత.”
పాల్వంచ దుర్గ
మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు, మణుగూరు
إرسال تعليق