ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
50 రోజుల తర్వాత మళ్లీ బడికి విద్యార్థులు బయలుదేరనున్నారు.
ఇప్పటికే బడికి వచ్చే విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు.
తొలిరోజే ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందించేందుకు చర్యలు చేపట్టారు.
2025-26 విద్యా సంవత్సరంలో 230 పని దినాలు ఉండగా.. ఉ.9 గంటల నుంచి సా.4 గంటల వరకు పాఠశాలలు జరగనున్నాయి.
إرسال تعليق