అశ్వాపురం: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
అశ్వాపురం : అంతరించిపోతున్న గ్రామీణ కళలు, కళారూపాలను కాపాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అశ్వాపురం మండల యువజన నాయకుడు గద్దల రామకృష్ణ అన్నారు....
వచ్చే వచ్చే.... తుపాకి రాముడు వచ్చే..... అంటూ వేషం కట్టి ఆత్మగౌరవం కోసం గొప్ప మాటలు చెప్పే తుపాకి రాయుళ్లు కల రోజు రోజుకి అంతరించిపోతుందని తెలంగాణలో ప్రాచీన కళలు, కళారూపాలకు ఎంతో ప్రాచుర్యం ఉండేదని, పూర్వ కాలంలో పౌరాణిక నాటకాలు, ఒగ్గుకథలు, గ్రామీణ కళాప్రదర్శనలను ప్రజలు ఆదరించేవారని తెలిపారు. సాంకేతిక విప్లవంతో ఆయాకళలు, నాటకాలకు ఆదరణ కరువై వాటిని నమ్ముకొని ఉపాధి పొందే కళాకారులు బతుకుదెరువు కోసం వలస బాటపట్టారని అన్నారు. ప్రజాచైతన్య కార్యక్రమాల్లో కళాకారుల పాత్ర కీలకమని
ఇలాంటి కళాకారులకు ప్రభుత్వం చేయూతని అందించాలని గద్దల రామకృష్ణ ఓ ప్రకటనలో కోరారు..
Also Read... ఇదెక్కడి విడ్డూరం... భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కొని తిన్నాడు..
కామెంట్ను పోస్ట్ చేయండి