పినపాక ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం విద్యుత్ ఉపకేంద్రం నందు జెండా ఎగురవేసి మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సిబ్బంది మాట్లాడుతూ... మేడే కార్మికుల హక్కులు, వారి కృషిని గౌరవించేందుకు, గుర్తించేందుకు ఇది ఒక సందర్భం అని అన్నారు. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి. 'మే డే'ను పాటించడం జరుగుతుందన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగాలన్నారు . ప్రతి శ్రామికుడు సమానంగా గౌరవించబడాలన్నారు. కార్మికులకు మే డే శుభాకాంక్షలు, మీ కృషికి ధన్యవాదాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో... విద్యుత్ సిబ్బంది స్వామి, భూషణం, శంకర్ , రాజమల్ల విష్ణుమూర్తి, వెంకట్రావు, వెంకన్న, రామకృష్ణ రావు,మీరా సాహెబ్, పాల్గొన్నారు.
కామెంట్ను పోస్ట్ చేయండి