రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: తెలంగాణలో రేషన్‌కార్డులు కలిగిన కుటుంబ దారులకు బిగ్ అలర్ట్ అనే చెప్పవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో కలిపితే కోటి వరకు రేషన్ కార్డులు దాటనున్నాయి. అయితే ఇప్పటికే రేషన్ కార్డు కలిగిన వారికి కేంద్రం ఓ కీలక ప్రకటన చేసింది.. ఈ నెల ఆఖరు వరకు అంటే.. మార్చి 31 నాటికి ఈ కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశించింది. లేదంటే కార్డు రద్దు అవ్వడంతో పాటు.. రేషన్ కార్డు ద్వారా లభించే ఏ సౌకర్యాన్ని మీరు పొందలేరని తెలిపింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో బోగస్ కార్డులు, నకిలీ కార్డులను ఏరివేసే ప్రక్రియలో భాగంగా దీనిని తీసుకొచ్చారు. వార్షిక ఆదాయం అధికంగా ఉన్న వారికి కూడా రేషన్ కార్డులు ఇచ్చారనేది మొదటి నుంచి వస్తున్న ఆరోపణ. దీని ద్వారా అనర్హులను రేషన్ కార్డుల నుంచి తీసివేయవచ్చు. అర్హులకు మాత్రమే పీడీఎస్‌ల ద్వారా లభించే రేషన్ అందాలనేది ప్రభుత్వ లక్ష్యం.

అయితే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం చాలా సులభం. మీ దగ్గర్లోని రేషన్ డీలర్ల వద్దకు వెళ్లండి. మీ కార్డు నంబర్ చెప్పినా.. రేషన్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ చెప్పినా.. మీ కేవైసీ పూర్తి అవుతుంది. ముందుగా డీలర్ మీ దగ్గర నుంచి ఆధార్ కార్డు, రేషన్ కార్డు అడుగుతారు. వాటిని మీరు అతడికి ఇవ్వగానే వివరాలను ఎంటర్ చేస్తారు. తర్వాత మీ బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన వివరాలు, ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాతో సరిపోతే.. మీ కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లే.

 అయితే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి మరో మార్గం కూడా ఉంది. ఆఫ్ లైన్ విధానంలో కూడా దీనిని పూర్తి చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి.. హోమ్ పేజీలో 'రేషన్ కార్డ్ సేవలు,' 'ఇ-సేవలు' అనే ఆప్ష‌న్ల‌ను సెలెక్ట్ చేసుకోండి. దీనిలో మీకు e-KYC అనే సెక్షన్ కనిపిస్తుంది. దీనిలో మీరు రేషన్ కార్డు నంబర్ తో పాటు.. ఆధార్ కార్డు నంబర్ తో లింక్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.

ఆ త్వార‌త e-KYC విభాగానికి వెళ్లండి. అనంత‌రం.. రేషన్ కార్డ్ నంబర్‌తో పాటు మీ ఆధార్‌తో లింక్ అయి ఉన్న‌ మొబైల్ నెంబర్‌ను వెరిఫై చేయండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. దానిని స్క్రీన్ పై కనిపిస్తున్న ఓటీపీ విభాగంలో ఎంటర్ చేయగానే వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. ఆధార్ వెరిఫికేషన్ తర్వాత e-KYC అప్‌డేట్ అవుతుంది. ఇలా మీరు ఇంటి దగ్గర కూర్చొని కూడా ఈ కేవైసీని పూర్తి చేయవచ్చు. ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేసిన వారికి ఎలాంటి సమస్య ఉండదు. వాళ్లు ఏం చక్కా రేషన్ దుకాణాల్లో రేషన్ ను తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ కేవైసీ పూర్తి చేయవని వారు మాత్రమే మార్చి 31లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.


Post a Comment

కొత్తది పాతది