అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

 గురువారం జరగనున్న ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ లో అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు తన ఓటు హక్కును వినియోగించుకొని విజయవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కొత్తగూడెం శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయులు అందరూ ప్రశాంతమైన వాతావరణం లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో ఏడు రూట్లు ఏర్పాటు చేయడం జరిగిందని,ప్రతి రూటుకి ఒక సెక్టార్ అధికారి మరియు ఒకటు రూట్ ఆఫీసర్ను నియమించడం జరిగిందని తెలిపారు. పిఓలు మరియు ఏపీవోలకు పోలింగ్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు చేపట్టవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.ఓటర్లుఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ఉండవు. బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉంటుంది.బ్యాలెట్ పేపర్ పై పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు, ఫొటో ఉంటాయి.ప్రాధాన్య క్రమంలో ఓటరుకు నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న గడి లో “1” నెంబరు వేయాలి. ఎన్నికల. అధికారులు ఇచ్చిన వాయిలెట్ పెన్నుతో మాత్రమే వేయాలి అని కలెక్టర్ సూచించారు. ఓటర్లు ఎన్నికల సంఘం అనుమతించిన ఏదేని గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని సూచించారు. ఓటర్లకు వారి యొక్క క్రమ సంఖ్య వివరాలు తెలిసే విధంగా పోలింగ్ కేంద్ర వద్ద ఓటర్ రికగ్నైజేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.


 ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఎలక్షన్ సూపర్డెంట్ దారా ప్రసాద్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది