నా చిరకాల వాంఛ పులుసు బొంత ప్రాజెక్ట్ కొత్త సంవత్సరంలోనే శంకుస్థాపన

 * నా చిరకాల వాంఛ పులుసు బొంత ప్రాజెక్ట్ కొత్త సంవత్సరంలోనే శంకుస్థాపన •

ప్రజా పాలన విజయోత్సవ సంబరాలలో పినపాక ఎమ్మెల్యే పాయం.

- బాణాసంచా కాల్చి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు.  

- సీ.ఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం.

 రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా బుధవారం నిర్వహించిన సంబరాలకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని  ప్రారంభించారు .ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున డప్పు చప్పులతో బాణసంచ కాల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం సీ ఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, దేశానికి అన్నం పెట్టే రైతన్న సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో ప్రజా రంజక పాలన సాగిస్తుందన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ 500 కే గ్యాస్, రైతులకు రూ 2 లక్షల రుణమాఫీ పథకాలను అమలు చేసి , ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ 2500 ఆర్థిక సాయం అమలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి అన్నారు. ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, పేదల కోసం, ప్రజల కోసం పనిచేసే ప్రజా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిన పాపం, గత పాలకులదని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న మొక్కవోని దీక్షతో ధైర్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయటం దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యయమన్నారు. ప్రభుత్వం చేసిన కుంభకోణాలు, దందాలకు పేదలపై భారం పడిందన్నారు. గత పదేండ్ల లో బీ ఆర్ ఎస్ ఇచ్చిన హామీలలో ఉచిత ఎరువులు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ ఎందుకు అమలు చేయలేక పోయిందో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ధరణి పేరుతో రాష్ట్రంలో ఉన్న భూములన్నీ బీ ఆర్ఎస్ నాయకులకు అన్యాక్రాంతమయ్యాయన్నారు. ఈ రాష్ట్రంలో ఆర్థికపరమైన సమస్యలు ఎన్ని ఉన్నా సంక్షేమ పథకాల అమలకు వెనుకాడబోమని, బీ ఆర్ఎస్ నాయకులకు గ్రామాల్లో కొచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. వరి వేస్తే ఉరే అన్న సన్నాసులు ఎక్కడ.. సన్న రకం ధాన్యానికి మద్దతు ధరతో, క్వింటా కు 500 రూపాయల బోనస్ ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడా ? అని నిలదీయాలని సూచించారు. మరో ఏడాదిలో అద్భుతమైన అభివృద్ధితో దేశం గుర్తించేలా రాష్ట్ర పాలన ఉండబోతుందన్నారు. నా చిరకాల వాంఛ అయినటువంటి పులుసు బొంత ప్రాజెక్ట్ వచ్చే కొత్త సంవత్సరం లోనే శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. కనకగూడెం మండలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప మరో కొత్త గా చేసిన అభివృద్ధి పనులు ఏం లేదని , గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న కూడా ఎటువంటి అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు అని అన్నారు .. ఇప్పుడున్న ప్రభుత్వ ఆసుపత్రి , విద్యుత్ సబ్ స్టేషన్ , కరకగూడెం మండల ఏర్పాటు ఇవన్నీ నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేస్తే అభివృద్ధి పనులే అని తెలిపారు.. పినపాక నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు భారీ మెజార్టీతో నన్ను గెలిపించి ఆశీర్వదించారు. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని ముగ్గురు మంత్రుల అండాదండలతో నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని అన్నారు .

ఈ కార్యక్రమంలో కరక గూడెం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ , సమత్ బట్టుపల్లి మాజీ సర్పంచులు పోలబోయిన శ్రీవాణి, తిరుపతయ్య , బట్టుపల్లి మాజీ సర్పంచ్ తోలం నాగేశ్వరరావు , రేగళ్ల మాజీ సర్పంచ్ కుంజ వసంతరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు యర్రా సురేష్, భూక్యా రాందాస్, గొగ్గాలి రవి, జలగం కృష్ణ, ఎట్టి నర్సయ్య, మండల కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగమణి వెంకటేశ్వర్లు, రఫీ, ఏపీఎం త్రిగుణ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

أحدث أقدم