నిర్మల్ జిల్లా: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అన్నదమ్ములు తల్లిదండ్రులతో గొడవపడి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారి మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాదకర సంఘటన పట్టణంలో కలకలం రేపింది. ఘటనా స్థలం వద్ద కుటుంబ సభ్యులు ఘోరంగా విలపిస్తున్నారు.

