మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించడంలో జిల్లా పోలీసుల ముందంజ




 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



*జిల్లాలోని సరిహద్దులో గల 20 మావోయిస్టు ప్రభావిత గ్రామాలకు పోలీసుల ఆధ్వర్యంలో మినీ రైస్ మిల్లుల అందజేత*




*జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కనీస సౌకర్యాలను అందించటమే మా లక్ష్యం : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్*


జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారికి కనీస సౌకర్యాలను అందజేయటమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.ఈరోజు చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత సరిహద్దు గ్రామాలైన 20 గ్రామాలకు మినీ రైస్ మిల్లులను అందజేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పాల్గొన్నారు.రాళ్లపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్ లు కూడా పాల్గొన్నారు.సుమారుగా 50 లక్షల రూపాయల వ్యయంతో 20 గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మినీ రైస్ మిల్లులను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.మినీ రైస్ మిల్లు కొరకు ఏర్పాటు చేసిన షెడ్డుతో కలిపి ఒక్కో యూనిట్ విలువ 2,50,000/-రూపాయల ఖర్చుతో 20 గ్రామాలలో 20 యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు.రాళ్లపురం గ్రామంలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఎస్పీ గారు మాట్లాడుతూ నిషేధిత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు విద్య,వైద్యం,రవాణా వంటి కనీస సౌకర్యాలతో పాటు మౌళిక సదుపాయాలను కూడా అందించటమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని అన్నారు.తమ తమ గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్న పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని,అట్టి సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి కృషి చేస్తామని తెలిపారు.ఏజెన్సీ గ్రామాలలోని యువత అన్ని రంగాల్లో ముందుండాలని తెలిపారు.రాళ్లపురం గ్రామం నుండి జాతీయ స్థాయిలో సెయిలింగ్ క్రీడలో పాల్గొన్న ఆడమయ్యను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.అనంతరం అడమయ్యను ఎస్పీ గ్రామస్తుల సమక్షంలో ఘనంగా సన్మానించారు.నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని,అలాంటి అసాంఘిక శక్తులకు ఎవరూ సహకరించకూడదని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం తరపున పోలీసు శాఖ ఆదివాసి ప్రజలకు అందిస్తున్న అభివృద్ధిని,లొంగిపోయిన మావోయిస్టులకు కల్పిస్తున్న పునరావాస సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని మావోయిస్టు పార్టీలో పనిచేసే సభ్యులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.రాళ్లపురం గ్రామం నుండి నిషేధిత మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న పొడియం లక్ష్మి కుటుంబాన్ని సందర్శించి,ఆమె కుటుంబ సభ్యులకు దుస్తులను అందజేశారు.ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మినీ రైస్ మిల్లును ప్రారంభించి,అట్టి మిషన్ పని చేసే విధానాన్ని ఎస్పీ పరిశీలించారు.ఈ సమావేశంలో పాల్గొన్న గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం చర్ల మండల పరిధిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.


ఈ కార్యక్రమంలో చర్ల సీఐ రాజు వర్మ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్సైలు నర్సిరెడ్డి,కేశవ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది