మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలతో పాటు కేసులు సిఐ అశోక్ రెడ్డి

G Rajashekar
By -
0

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్

అశ్వాపురం : మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సిఐ అశోక్ రెడ్డి హెచ్చరించారు.


సోమవారం ఆయన తన సిబ్బందితో కలిసి ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు.


ఈ సందర్భంగా పలు వాహనాలను ఆపి, వాహనాల పత్రాలను పరిశీలించారు

తాగి వాహ నాలు నడుపుతున్న వారిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు.రాంగ్ రూట్లో ప్రయాణాలు నేరమని , వాహనదారులు రాంగ్ రూట్లో దొరికితే కేసులు నమోదు చేస్తామన్నారు. వాహనాలకు సంబంధించి అన్ని పత్రాలు కలిగి ఉండాలన్నారు, వాహనాలు నడిపేటప్పుడు మెల్లగా వెళ్లాలని, అతి వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడిన కుటుంబ పరంగా,ఆర్థికపరంగా నష్టపోతారని అన్నారు , వాహనాలు జాగ్రత్త

గా నడిపి గమ్యం చేరుకోవాలని వాహనదారులకు సూచించారు. 

ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)