దారుణం.. కోయంబత్తూర్లో దారుణం జరిగింది.
కునియముత్తూరులో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు కాలేజీ విద్యార్థులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఇంటర్ ఫెయిలై బామ్మ ఇంట్లో ఉంటున్న బాలికకు సోషల్ మీడియాలో ఓ కాలేజీ విద్యార్థితో పరిచయమైంది.
మాయమాటలతో ఆమెను నమ్మించి తన గదికి రప్పించుకున్న విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు.
అంతటితో ఆగకుండా ఆరుగురు సహచర విద్యార్థులతోనూ ఆమెపై ఆకృత్యానికి పాల్పడి పైశాచిక ఆనందం పొందారు.
ఇప్పటి యువత స్మార్ట్ ఫోన్లకు బానిస అయ్యి లవ్ స్టోరీస్ చూసి లవ్ లో పడడం అలవాటైపోయింది. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లలు ఏం చేస్తున్నారు అని ఎప్పుడు ఒక కంట కనిపెట్టాలి. పిల్లలను బామ్మ ఇంట్లో ఉంచితే కొందరు ఏం చేసినా అడిగే వారు లేరని చెడు మార్గం లో వెళ్లే ఆవశ్యకత ఉందని చెప్పాలి. ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని చెప్పాలి.
కామెంట్ను పోస్ట్ చేయండి